AP Grama/Ward Sachivalayam Exams August 2020 Are Postponed
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు ప్రకటించారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై త్వరలో మళ్లీ వెళ్లడిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 15,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరిలో ఈ ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి… 19 నోటిఫికేషన్లు జారీ చేసింది. గతంలో ఈ ఉద్యోగాలను ఆగస్టులో భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ‘ఆగస్టు రెండో వారంలో జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో తెలియజేస్తాం’ అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.

GS/VS Exam. in A.P. – It is to inform all concerned that due to COVID-19, GS/VS Recruitment Exams are NOT being conducted in 2nd week of August 2020 as announced earlier. Fresh dates/schedule will be announced in due course.