Republic Day Speech in Telugu 2021 For Students, Teachers: Republic Day is a very important and special occasion for India and citizens of India. Indians celebrate Republic Day every year on 26th January with lots of preparations. India is celebrating the 72nd Republic Day on the commemoration of a historic moment when India’s constitution came into start on 26th January, 1950, an occasion that completed the country’s long required change toward becoming an independent republic country.
Republic Day Speech in Telugu 2021 For Students, Teachers
72nd గణతంత్ర దినోత్సవ ప్రసంగం
నా గౌరవనీయ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు మరియు నా సహవిద్యార్థులందరికీ నా ఉదయం శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. మన దేశం యొక్క 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనమందరం ఇక్కడ గుమిగూడామని మనందరికీ తెలుసు. ఇది మనందరికీ చాలా శుభ సందర్భం. 1950 నుండి, మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవాన్ని చాలా ఆనందంతో మరియు ఆనందంతో జరుపుకుంటాము. పండుగ ప్రారంభానికి ముందు, మా ముఖ్య అతిథులు దేశ జాతీయ జెండాను ఎగురవేస్తారు. దీని తరువాత మనమందరం భారతదేశ ఐక్యత మరియు శాంతికి చిహ్నంగా ఉన్న జాతీయ గీతాన్ని నిలబడి పాడతాము.
మన జాతీయ గీతాన్ని గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. మన జాతీయ జెండా మధ్యలో మూడు రంగులు మరియు 24 సమాన అగ్గిపెట్టెలతో ఒక వృత్తం ఉంది. భారత జాతీయ జెండా యొక్క మూడు రంగులు వాటి స్వంత అర్ధాన్ని కలిగి ఉన్నాయి. ఎగువన కుంకుమ రంగు మన దేశం యొక్క బలాన్ని మరియు దైర్యాన్ని చూపిస్తుంది. మధ్యలో తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది, దిగువన ఆకుపచ్చ రంగు పెరుగుదల మరియు శ్రేయస్సును సూచిస్తుంది. జెండా మధ్యలో 24 సమాన మ్యాచ్ స్టిక్స్ ఉన్న నేవీ బ్లూ కలర్ సర్కిల్ ఉంది, ఇది గొప్ప రాజు అశోకుడి ధర్మ చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
మనం జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఎందుకంటే భారత రాజ్యాంగం 1950 లోనే ఈ రోజున ఉనికిలోకి వచ్చింది. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలో, భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని రాజ్ పాత్ లో ఇండియా గేట్ ముందు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం, ఈ పండుగ యొక్క ప్రకాశాన్ని పెంచడానికి “అతితి దేవో భవ:” అని చెప్పే ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ముఖ్య అతిథిని (దేశ ప్రధాన మంత్రి) పిలుస్తారు. ఈ సందర్భంగా కవాతుతో పాటు జాతీయ జెండాకు భారత సైన్యం వందనం. భారతదేశంలో వైవిధ్యంలో ఐక్యతను ప్రదర్శించడానికి భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయం యొక్క పెద్ద ప్రదర్శనను వివిధ రాష్ట్రాలు చూపించాయి.
Also Check: Republic Day Speech 2021 in English
Republic Day Speech in Telugu 2021
About Republic Day
రిపబ్లిక్ డే అంటే ఏమిటి?
ఈ ప్రశ్న అడగగానే, గణతంత్ర దినోత్సవం అని చక్కగా తెలుగులో చెబుతారు లేదంటే సంపూర్ణ స్వాతంత్య్రం పొందిన రోజు అని చెబుతారు. అంతేకానీ, రిపబ్లిక్ డే పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన వారు అరుదు. రిపబ్లిక్ డే అంటే మనం నిర్మించుకున్న మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అంతకుముందే రాజ్యాంగం ఉన్నప్పటికీ అది బ్రిటిష్ రాజ్యాంగం కావడంతో, మనకంటూ ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో నిపుణులైన పెద్దలు కొందరు కమిటీగా ఏర్పడి, రాజ్యాంగ రచన ప్రారంభించారు. ఇందుకు రెండు సంవత్సరాలా పదకొండు నెలలా 18 రోజులు పట్టింది. 64 లక్షల రూపాయలు ఖర్చయింది.
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ, అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు. ఇంతకూ రాజ్యాంగం ” అంటే ఏమిటీ ? ఏ దేశ పరిపాలనకయినా, కొన్ని ప్రత్యేక చట్టాలు అవ సరం. అవి ప్రభుత్వ ఏర్పాటును, కార్యనిర్వహణ వ్యవస్థలను నిర్దేశి . స్తాయి. అలాంటి చట్టాల సముదాయాన్నే రాజ్యాంగమని పిలుస్తారు. ఉదాహరణకు మీరు చదువుకునే స్కూలుకు యూనిఫామ్, బ్యాగ్, టై, షూస్ వంటివి స్కూల్ వాళ్లు ఏర్పాటు చేసుకున్న విధి విధానాల మేరకే ఉంటాయి కదా. ఇది కూడా అలాగేనన్నమాట. మనల్ని మనం పరిపా లించుకునే ప్రత్యేక విధివిధానాలను రూపొందచుకోవడం కోసం, ఎన్నో ఇతర రాజ్యాంగాలను అధ్యయనం చేసి, వాటిలోని మంచిని తీసుకుని మనకోసం మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న మాట. ఇందుకు డా. బి.ఆర్. అంబేడ్కర్, డా. బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారు. మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవడం ఆరంభించు కున్న రోజు కాబట్టే, దీనికి ఇంత ప్రాముఖ్యత. ఈ రోజున సాహస బాలలకు అవార్డులతో సహా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
Video: Republic Day Speech 2021 in Telugu
రిపబ్లిక్ డే ప్రసంగాలు / Republic day Speech
ఉపాధ్యాయులకు & ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడే ప్రసంగాలు తెలుగులో… (3-types)
Republic day Speech in Telugu for Teachers & Students 2021
ప్రసంగం-1
భారత దేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడినది. దీనికి అధ్యక్షుడుగా డా. బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డా.బి.ఆర్.అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతమందో మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు కాలం పట్టింది. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరచడంలో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది. 1930 జనవరి 26 న పూర్ణ స్వరాజ్ కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావటంతో 26 జనవరిని ఎంపిక చేశారు.
ప్రసంగం-2
బ్రిటీష్ పాలకుల పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారతదేశ పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమలులోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందటం జరిగింది. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి పౌరుడు దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది. వీటన్నింటకీ గుర్తుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతీ పౌరుడు హక్కులను ఉపయోగించుకుంటూ, బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి.
ప్రసంగం – 3
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్, అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్)కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. లా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే “భారత గణతంత్ర్య దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్ర్యం పోరాటానికి నాయకత్వం వహించిన “భారత జాతీయ కాంగ్రెస్’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారతదేశ ఉత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు.
Republic Day Speech 2021 for students
26th January Republic day speech in Telugu 2021 for Primary school children’s (ప్రాధమిక పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడే ప్రసంగాలు తెలుగు లో)
ప్రసంగం-1
ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26. అందువలన మనం ఈరోజును రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాము. మనకు బ్రిటిష్ వారి నుండి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనం బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసుకున్నాము. మన రాజ్యాంగ పరిషత్తు వారు రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చినది జనవరి 26. అందువలన ఈరోజు కులాలు, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జరుపుకోవాల్సిన జాతీయ పండుగ.
ప్రసంగం-2
మన పాఠశాలలోని HMకు, టీచర్లకు మరియు మన అతిథులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక జాతీయ పండుగ. భారతదేశంలోని ప్రతి భారతీయుడు జనవరి 26ను ఎంతో గొప్పగా ఉంటాడు జరుపుకుంటాడు. రిపబ్లిక్ / గణతంత్రం అనగా రాజ్యాధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా గాని లేక పరోక్షంగా గాని ఎన్నిక కావడం. అందుచేత మన రాజ్యా ధినేత అయిన రాష్ట్రపతి ఆ రోజున జెండా ఎగుర వేస్తారు. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకు రాజ్యాంగం లేదు. అందువలన బి.ఆర్. అంబేద్కర్ మరియు మిగిలిన సభ్యుల కృషి వలన మన రాజ్యాంగం జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చింది. అందువలన ఈరోజు మనకు ప్రత్యేకమైనది.
ప్రసంగం-3
పిల్లలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడం యొక్క దేశం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనవరి26, 1950 నాడు మనచే రచించిన మన రాజ్యాంగం ఈ రోజున అమలు లోకి వచ్చింది. అందువలన 26న గణతంత్ర దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజున భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయన ఎగురవేసిన తర్వాతనే మనం ఎగురవేయవలెను. ఎందుకంటే ఆయన మనకు రాజ్యాధినేత మరియు రాజ్యంగా సంరక్షకుడు. ఇది కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయ భారతదేశ పౌరుడు ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన పండుగ.
ప్రసంగం-4
ఈ సమావేశం లోని అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 26, 1950 నాడు మనకు రాజ్యాంగ పరిషత్ వారి చేత రచించబడిన భారత రాజ్యాంగం లోకి వచ్చింది.భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11నెలల 18 రోజుల సమయం పట్టింది. ఇండియా లోని ప్రతి పౌరుడు దీనిని అనుసరించాలి. మన దీని ప్రకారమే నడుచుకోవాలి దీన్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రపతి మీదనే ఉంటుంది. అందువలన ఆయన మన రాజ్యాధినేత.ఈ రోజున రాష్ట్రపతి ఈ జెండాను ఎగుర వేస్తారు. ఆయన మన చే పరోక్షంగా ఎన్నుకోబడిన ప్రతినిధి.
Video: Republic Day Speech in Telugu 2021
Yes, People can Read and Download Republic Day Speech from Above.
we are Celebrating 72nd Republic Day in 2021.
Not nice