Telangana Lockdown Extension: Chief Minister of Telangana K Chandrashekhar Rao announced in a press meet that the lockdown in the state is extended till 29th May 2020. The decision is announced after a Special State Cabinet meeting held at Pragathi Bhavan today.
Telangana Govt Extends lockdown till May 29

తెలంగాణలో లాక్ డౌన్ను మే 29 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 70 రోజుల వరకూ నిర్భందం ఉండగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెప్తున్నారు. రాత్రి 7 తర్వాత కచ్చితంగా కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర మంత్రి వర్గం భేటీ జరిగిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ చర్చ అనంతరం సీఎం లాక్ డౌన్ను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా విషయంలో తెలంగాణ గడ్డన పడిందని.. కానీ ఇంకా ప్రజలు స్వీయ నిర్భందంలోనే ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎంతో మిన్నగా ఉందని వివరించారు. మనకు ఉన్న ఏకైక ఆయుధం లాక్ డౌన్, భౌతిక దూరం పాటిస్తూ చక్కగా కేసులను తగ్గించుకున్నట్లుగా కేసీఆర్ గుర్తు చేశారు.