Jagananna Ammavodi Laptop Scheme 2021 – Eligibility, Apply Online Registration, Specifications

3

Jagananna Ammavodi Laptop Scheme 2021: CM Jagan offered another favor for students who are studying in Andhra Pradesh. Already, it was known that the AP Government is offering Rs 15,000 per annum under Ammavodi Scheme for poor mothers who are sending their children to school. As part of this, CM Jagan inaugurated the laptop scheme in the Nellore district on Monday, January 11, 2021. He was speaking at a meeting organized on the occasion. In the meeting, AP CM Jagan said that the AP government has decided to provide a laptop to a student studying from 9th to 12th class.

Jagananna Ammavodi Laptop Scheme 2021 – Eligibility, Apply Online Registration, Specifications

Under Amma Odi Scheme, students can avail of the laptop or the money can be given to the parents or they can choose whether they want a laptop or not. It has been announced that we will be introducing this from next year.The AP Government is providing Rs 25000- Rs 27000 worth laptops at Rs 18,500.

Jagananna AMMA Vodi Free Laptop Scheme 2021

Scheme NameAMMA Vodi Free Laptop Scheme
Eligibility9th to 12th class Students
Date Of Scheme2022 onwards

Jagananna Ammavodi Laptop Scheme Guidelines

విషయం : పాఠశాల విద్యా శాఖ – “నవరత్నాలు” – జగనన్న అమ్మఒడి పథకం – 9 -12 తరగతుల విద్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం-గురించి.,

ఆదేశములు:

1. రాష్ట్రములోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులకు తెలియ చేయునది ఏమనగా, పైన సూచించిన సూచికలు 2 మరియు 3 ల నందు “నవరత్నాలు” లో భాగంగా “జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను అర్హులైన 1 వ తరగతి నుండి 12 వ తరగతి (ఇంటర్ మీడియట్ ) చదువుచున్న విద్యార్థుల తల్లికి లేదా గుర్తించబడిన సంరక్షకుల వారికి సంవత్సరానికి రూ.15,000 / – ఆర్థిక సహాయం అందిస్తున్నది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అందరికి నాణ్యమైన విద్యకు గాను భరోసా ఇవ్వడంతో పాటు విద్యార్థుల హాజరుని నిరంతరం పరిశీలిస్తూ వారు మెరుగైన అభ్యాసన ఫలితాలను సాధించడం కోసం 1 నుండి 12 (ఇంటర్మీడియట్ విద్య) తరగతుల వరకు పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి గాను అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు పరుస్తూ ఉన్నది. 

2. కాగా, రానున్న విద్యాసంవత్సరం నుండి, అనగా, 2021-22 సంవత్సరం నుండి, అమ్మఒడి పథకం ద్వారా అర్హులైన 9 -12 తరగతుల విద్యార్థుల తల్లులకు వారి విద్యార్థుల విద్యావికాసం కోసం ఎవరైనా తల్లులు నగదు బదులు లాప్ టాప్ లు కోరుకున్నట్లయితే వారికి లాప్ టాపులు అందించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియపరిచి, వారు అమ్మ ఒడి కింద సహాయం నగదు రూపేణా కోరుకుంటున్నారా లేక లాప్ టాప్ ల రూపేణా కోరుకుంటున్నారా తెలుసుకోవటం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తల్లుల్ని ఉద్దేశించి ఒక లేఖ రాసారు. ఆ లేఖ ప్రతిని దీనివెంట జతపరుస్తున్నాం. 

3. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఉత్తరమును అమ్మఒడి పథకం కింద అర్హులైన 9-12 విద్యార్థుల తల్లులందరికీ అందిస్తూ, వారి అభీష్టం తెలుసుకుని తిరిగి ప్రభుత్వానికి తెలియపరచటం కోసం అందరు జిల్లా విద్యాశాఖాదికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాది కారులకు ఈ క్రింది సూచనలు ఇవ్వడమైనది.

  • ఈ ఉత్తర్వులకు పి. డి. ఎఫ్ . రూపములో జతపరిచిన సదరు లేఖను డి.సి. యి . బి. ల ద్వారా 10-4-2021 లోపుగా ముద్రించాలి.
  • ఆ విధంగా ముద్రించిన లేఖను మండల విద్యా శాఖాదికారుల ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు కళాశాలల ప్రిన్సిపాళ్ళకు విద్యార్ధుల సంఖ్య ను అనుసరించి 154-2021 లోపుగా అందించాలి. 
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు అందరు కూడా తమ విద్యాసంస్థల్లో 9 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో 19-4-2021 న సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి లేఖలోని అంశాలను విద్యార్ధులకు చక్కగా విశదీకరించాలి. విద్యార్ధులు ఆ లేఖను ఇంటికి తీసుకునివెళ్ళి తమ తల్లులకు లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని తెలుసుకుని ఆ లేఖపైన రాయించి తిరిగి ఆ లేఖను 22-4-2021 నాటికి ప్రధానోపాధ్యాయులకు అందచెయ్యాలి. 
  • ఆ విధంగా విద్యార్థులు తమకు తిరిగి ఇచ్చిన అంగీకార పత్రములోని అంశాలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు స్వీయ పర్యవేక్షణలో అమ్మ ఒడి వెబ్ సైటు నందు 26-4-2021 లోపుగా పొందుపరచాలి. ఆ విధంగా పొందుపరిచిన తర్వాత, ఆ అంగీకారపత్రాలను పాఠశాల, కళాశాల రికార్డులో భద్రపరచాలి. 

4. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయములో పూర్తిచేయడానికి వీలుగా జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ క్రింది స్థాయి సిబ్బందికి తగుసూచనలు అందిస్తూ జయప్రదంగా పూర్తిచెయ్యాలి.

Ammavodi Laptop Scheme 2021 For 9th Class To 12th Class Students

“జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకున్న అందుకోనున్న ప్రతి అక్క చెల్లెమ్మలకి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. మన రాష్ట్రంలో నిరు పేద తల్లులు మీ పిల్లలని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందజేస్తే కష్టాలు కొంతవరకైనా తీరతాయనీ, మీ కలలు నెరవేరుతాయని భావించాను. అందుకని నవరత్నాలు లో భాగంగా ‘అమ్మఒడి’ పథకం ప్రారంభించి ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకుంటూ గత రెండు సంవత్సరాలుగా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులైన చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15,000/- చొప్పున ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా బదిలీ చేసిన సంగతి మీకు తెలుసు. ఈ పథకం రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోనూ అందరి దృష్టి ఆకర్షించినది.

పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ బడిలో ఎదిగే పిల్లలకు “అమ్మఒడి’ పథకం శ్రీరామరక్ష లాంటిది. అమ్మఒడి ఒక్కటే కాకుండా ‘జగనన్న గోరుముద్ద’, ‘మనబడి:నాడు-నేడు’, ‘జగనన్న విద్యాకానుక’ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి పేదబిడ్డ తలరాత మార్చే దిశగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న సంగతి కూడా మీకు తెలుసు.

అయితే, కోవిడ్ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లీషు మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి 9 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మీరు కోరుకుంటే నగదు బదులు లాప్ టాప్ ఇవ్వాలని నిర్ణయించాం. దీనితో పాటు గ్రామగ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నాం.

Janananna Ammavodi Laptop Specifications/Configuration

పదేళ్ల తర్వాత ప్రపంచం మరింత ముందుకు పోనున్నది. మారబోయే ప్రపంచంలో ఈ పిల్లలు వెనకబడకూడదనే బాధ్యతతో మీ పిల్లలకు మేనమామగా మీకు ఈ సూచన చేస్తున్నాను. బ్రాండెడ్ లాప్ టాప్స్ డ్యూయెల్ కోర్ (దానికి సమానమైన ప్రొసెసర్), 4 జీబీ రామ్, 500జీబీ హార్డ్ డిస్, 14 ఇంచుల తెర (స్క్రీన్), విండోస్ 10 (ఎసీఎఫ్), మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఆఫీస్, 3 సంవత్సరాల వారంటీతో ఉంటుంది. అవసరమైతే 7 రోజులలోనే రీప్లేస్మెంట్ లేదా రిపేర్ బాధ్యత గ్రామ సచివాలయం ద్వారా సంబంధిత కంపెనీ వారే చేయడం జరుగుతుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ (మొబైల్ డివైస్ మేనేజ్మెంట్) ఇన్స్టాల్ చేసి ఇవ్వడం ద్వారా చెడు/ హానికర వెబ్ సైట్ను నిరోధించి వాటి ప్రభావం పిల్లలపై పడకుండా ఉండేలా చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో లాప్టాప్స్ కొనుగోలు చేస్తున్నందున మార్కెట్లో దాదాపు 25-27 వేల రూపాయలున్న బ్రాండెడ్ లావాటాను కేవలం రూ. 18,500/- లకే అందించడం జరుగుతుంది. ఈ బ్రాండెడ్ లాప్టాప్స్ తో మీ పిల్లలు ఈ కింది విధమైన పనులు చేసుకోవచ్చు.

ProcessorDual Core with Equivalent Processor
RAM4 GB
Hard Disk500 GB
Screen14 Inch
Operating SystemWindows 10
PriceRs 18500/- (market Value Rs 25,000 to Rs 27,000)
  • ఆన్లైన్లో పాఠాలు వినొచ్చు.
  • ఆన్లైన్లో లేదా ఆన్లైన్లో చదువుకు సంబంధించి వీడియోలు చూసుకోవచ్చు. –
  • డిజిటల్ రూపంలో ఉన్న పుస్తకాలు చదువుకోవచ్చు.
  • ఇంటర్నెట్లో చదువుకు సంబంధించి అపారంగా సమాచారాన్ని వెతకొచ్చు.
  • ఈమెయిల్ ఇవ్వవచ్చు. పొందవచ్చు.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి వాటితో ప్రాజెక్టు పనులు చేయవచ్చు.

కాబట్టి మీ బిడ్డకు ‘అమ్మఒడి’ పథకంలో నగదు బదులు లాప్ టాప్ కోరుకున్నట్లయితే మీ యొక్క అంగీకారాన్ని ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలియజేయవలసినదిగా కోరుతున్నాను.

CM Jagan said the government was in talks with various well-known companies. Tenders will be called in this regard and reverse tendering will also be done. The government-provided computer will have 4 gigabytes of RAM, 500 gigabytes of storage, Windows 10 operating system, 365 student version, and other facilities. It also comes with a three-year warranty. If the laptop breaks down, the company will make a deal with them to repair or replace it within seven days.

He said that various schools have started online classes due to corona, but some people have stayed away from it. That is why the government has decided to provide laptops. Computer literacy course will be introduced from the 8th class. He said that steps would be taken to provide internet facilities to every village in the next three years at a cost of Rs 5,900 Cr.

Who is Eligible to Get Amma Vodi Free Laptops?

From 9th to 12th Class Students can Choose the Option Free Laptop instead of 15000 Rs.

From Which Year Amma Vodi Free Laptops will be Distributed?

From 2022 Onwards, Free Laptop Option can be chosen.

What are the Amma Vodi Free Laptop Specifications?

4 GM RAM, 500GB Hard Disk, Intel Core Processor, Windows 10 Operating System & Windows 365 Student Version

What is cost of Laptop?

18500 rs quoted as of now

Do i Need to Register for Amma Vodi Free Laptop Scheme?

No, You Need not to register separately for laptop scheme and from next year 2022, the option will be displayed along with Cash payout so that we can select either cash 15000 or Laptop depends on our need.

Previous articleKarnataka GDS Result 2021 – Postal Cycle 3 Merit List, Selected Candidates & Cutoff Marks
Next articleJNTUK R19 2-2 Transportation Engineering – II Material PDF Download

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here